సీఐడీ దాడి కేసు విచారణను త్వరితంగా పూర్తి చేయండి : డీజీపీకి ఆర్ఆర్ఆర్ లేఖ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (15:06 IST)
తనపై సీఐడీ దాడి చేసిన కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసలకు గురిచేశారని డీజీపీకి రఘురామ వెల్లడించారు. ఈ దాడి కేసులో ప్రధానంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడి ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినప్పటికీ అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పందించలేదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ కోరిక మేరకు దర్యాప్తును పూర్తి చేసి నివేదికను త్వరితగతిన అందజేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments