Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ దాడి కేసు విచారణను త్వరితంగా పూర్తి చేయండి : డీజీపీకి ఆర్ఆర్ఆర్ లేఖ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (15:06 IST)
తనపై సీఐడీ దాడి చేసిన కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసలకు గురిచేశారని డీజీపీకి రఘురామ వెల్లడించారు. ఈ దాడి కేసులో ప్రధానంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడి ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినప్పటికీ అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పందించలేదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ కోరిక మేరకు దర్యాప్తును పూర్తి చేసి నివేదికను త్వరితగతిన అందజేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments