Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారావారిపల్లెలో అమరావతి పంచాయతీ.. హాజరుకానున్న ఆరుగురు మంత్రులు

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (12:15 IST)
రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నో రకాలైన ఆందోళనలు చేస్తున్న ఏపీలోని వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేలా లేదు. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం రీ లొకేషన్ పేరుతో చీకట్లో జీవోలు జారీచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మంత్రులు మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా తొలి సభను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆరుగురు మంత్రులు హాజరుకానున్నారు. 
 
ఈ సభను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, దాని వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వైసీపీ నేతలు వివరించి చెప్పనున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసనకు దిగారు. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం