పోలవరం నిర్మాణంలో అవినీతి లేదు.. సీబీఐ విచారణకు నో ఛాన్స్ : కేంద్రం

Webdunia
సోమవారం, 15 జులై 2019 (16:31 IST)
పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందనీ, సీబీఐ విచారణ జరిపించాలంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్టు తమకు నివేదికలు రాలేదనీ అందువల్ల సీబీఐతో విచారణ జరిపించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టంచేశారు. 
 
సోమవారం పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని నిలదీశారు. పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందన్నారు. 
 
విజయసాయి ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. సీబీఐ విచారణకు అవకాశం లేదని స్పష్టంచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments