Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణంలో అవినీతి లేదు.. సీబీఐ విచారణకు నో ఛాన్స్ : కేంద్రం

Webdunia
సోమవారం, 15 జులై 2019 (16:31 IST)
పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందనీ, సీబీఐ విచారణ జరిపించాలంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్టు తమకు నివేదికలు రాలేదనీ అందువల్ల సీబీఐతో విచారణ జరిపించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టంచేశారు. 
 
సోమవారం పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని నిలదీశారు. పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందన్నారు. 
 
విజయసాయి ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. సీబీఐ విచారణకు అవకాశం లేదని స్పష్టంచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments