Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - షా ద్వయం అనుమతితోనే రివర్స్ టెండరింగ్ : విజయసాయి రెడ్డి

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టినట్టు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు.. కేంద్ర జలవనరుల శాఖను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పీపీఏతో పాటు.. కేంద్రం గుర్రుగా ఉంది. పైగా, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ కంపెనీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అంశంపై వాడివేడిగా చర్చసాగుతోంది. 
 
దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. 
 
మోడీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢసంకల్పమని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments