మోడీ - షా ద్వయం అనుమతితోనే రివర్స్ టెండరింగ్ : విజయసాయి రెడ్డి

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టినట్టు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు.. కేంద్ర జలవనరుల శాఖను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పీపీఏతో పాటు.. కేంద్రం గుర్రుగా ఉంది. పైగా, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ కంపెనీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అంశంపై వాడివేడిగా చర్చసాగుతోంది. 
 
దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. 
 
మోడీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏపీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢసంకల్పమని విజయసాయి రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments