Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా మతమార్పిడులు... 1.8 శాతం నుంచి 25 శాతం పెరుగుదల...

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (15:18 IST)
వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతమార్పిడులు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. ఈయన కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదు.. ఏకంగా గణాంకాలను సైతం వెల్లడిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో మత మార్పిడి యథేచ్చగా జరుగుతోందని పేర్కొంటూ ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 2011లో ఏపీలో క్రిస్టియన్ల జనాభా 1.8 శాతంగా ఉందని... ఇప్పుడు అది 25 శాతం వరకు పెరిగిందని గుర్తు చేశారు. 
 
ముఖ్యంగా, గత రెండున్నరేళ్ళలో ఈ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దీనికి కారణం మతమార్పిడులేనని చెప్పారు. అయితే ఇది ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం లేదని చెప్పారు. ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పారు.  
 
ఇకపోతే, రాష్ట్రంలోని 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని రఘురాజు తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో దాదాపు 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు సమానంగా చర్చిలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments