Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌తో వైకాపా ఎంపీ భేటీ... జనసేనలో చేరికే తరువాయి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (11:57 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి బాలశైరి వెళ్లారు. 
 
గత  2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన బాలశౌరి.. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మరుసటి రోజే జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
అయితే, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన చేరిక, ఇతర రాజకీయ అంశాలతో వారిద్దరు చర్చించినట్టు సమాచారం. కాగా, వైకాపా నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments