Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (14:29 IST)
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా ఉన్న అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై విడుదలయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌కు 919/2022 అనే నంబరును కేటాయించారు. ఇది ఈ నెల 7వ తేదీన విచారణకు రానుంది. 
 
అదేసమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ పలు దళిత సంఘాలు కోర్టులో పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా, అనంతబాబుకు ఈ నెల 6వ తేదీతో 15 రోజుల రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని కాకినాడ సర్పవరం పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 
 
నిజానికి ఒక హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడిని తక్షణమే తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సివుంది. కానీ, రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా పోలీసులు ఆ పని చేయలేదు. పైగా, రిమాండ్ ముగియనున్న నాలుగు రోజులకు ముందు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనుండటం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments