Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్ల‌పూడి మార్కెట్ యార్డులో ధాన్యం రైతులు ఇబ్బందిప‌డొద్దు!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:55 IST)
ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ తలశిల రఘరాం విజ‌య‌వాడ జెసి మాదవీలత గారికి విజ్ణప్తి చేశారు. విజ‌య‌వాడ శివారు గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మాదవీలత  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, తలశిల రఘరాం సందర్శించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వారు ధాన్యం రైతులతో మాట్లాడారు. మిల్లర్లు తరుగు పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
రైతుల నుంచి వివరాలను సేకరించిన జెసి మాదవీలత సంబందిత మిల్లర్లతో మాట్లాడి, సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రైతులను ఇబ్బందులను వెంట‌నే తీర్చాల‌ని, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ రఘరాం సంబందిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్, మండల పరిషత్ వైస్ చైర్మన్ వేమూరి సురేష్, సొసైటీ అధ్యక్షులు బోర్రా వెంకట్రావు, స్థానిక నాయకులు జాస్తి జగన్, గంగవరపు శివాజీ, గేరా సుమన్, యంపిటిసీ సభ్యులు, రైతులు, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments