Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (16:09 IST)
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి శివకుమార్‍‌ దాడి చేసిన బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు. అందువల్ల తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
తన కుటుంబ సభ్యులకు వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత ఎమ్మెల్యపై కేసు పెట్టారు కానీ, చర్యలు తీసుకోలేదన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్‌ అనే ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేశారు. దీనికి ఓటరు కూడా ప్రతిదాడి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments