Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో ఎమ్మెల్యే రోజాకు 'పోకిరి' పూనాడు...

రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీన

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (16:27 IST)
రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీని జగన్ మోహన్ రెడ్డి తర్వాత తీవ్ర స్థాయిలో వైకాపా నుంచి ఇంకెవరైనా విమర్శిస్తున్నారా అంటే ఎమ్మెల్యే రోజా అని చెప్పక తప్పదు. ఆమె మాటలు అలా వుంటాయి మరి. 
 
ఇటీవలే నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాయి. దాంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నటి, ఎమ్మెల్యే రోజా కాకినాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలోని ఓ డైలాగును ఆవేశంతో చెప్పారు.
 
అదేమిటంటే... "ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... (వాడే) వారే కాకినాడ ఓటర్లు(పండుగాడు)" అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీని కాకినాడ ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. మొత్తమ్మీద ప్రచారంలో సినిమా డైలాగులతో రోజా బాగానే ఆకట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments