Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనలా చెప్పారట... రోజాకు కౌంట్‌డౌన్ స్టార్ట్... జగన్ ఆ పని చేస్తే ఔట్...

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (14:54 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట. 
 
ఆ నివేదికలో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం అని తేల్చి చెప్పారట. ఆ నివేదికను చూసిన జగన్ కాస్తంత షాక్ తిన్నప్పటికీ చర్యలు తీసుకోక తప్పదన్న ఆలోచనకు వచ్చేశారట. అధికార పక్షాన్ని ఎండగట్టడంలో దిట్ట అయినప్పటికీ ప్రజల్లో మైలేజి రావడంలో మైనస్ మార్కులు పడుతున్నాయని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం. 
 
దీనితో జగన్ వారి స్థానాల్లో వేరేవారిని నియమిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ ఇటీవలే... జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నంతకాలం చంద్రబాబు నాయుడుకి దిగులే లేదని తేల్చి చెప్పడాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments