Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:41 IST)
రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ లోకేష్ చెప్పగానే.. ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో అమలుచేసి చూపించారని రోజా ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టాక లోకేశ్‌ చేస్తున్న కామెడీ జబర్దస్త్‌ను దాటేసిందన్నారు. అందువల్ల ఇకపై జబర్దస్త్ షోకు వీక్షకులు తగ్గిపోతారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని సృష్టించడానికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని అయ్యానంటూ తన మనసులో మాటను లోకేశ్‌ బయటపెట్టారని అన్నారు.
 
చెప్పినవిధంగానే తన తండ్రి, మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరక్కుండా చేశారన్నారు. లోకేశ్‌ ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, వాటిని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments