Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వెధవలకి అవి లేకుండా కోసిపారెయ్యాలి : ఎమ్మెల్యే రోజా ఫైర్

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (15:53 IST)
ఇటీవల గుంటూరుకు చెందిన మైనర్ బాలికను ఒంగోలులో కొందరు కామాంధులు ఓ గదిలో 10 రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం జరిపారు. వీరిలో ఓ దివ్యాంగుడు, నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు, కొదరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ సామూహిక అత్యాచార ఘటనకు ప్రధాన సూత్రధారి దివ్యాంగుడు కావడం గమనార్హం. 
 
దీనిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. 10 రోజుల పాటు 16 యేళ్ళ బాలికను గదిలో బంధించి సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలన్నారు. 
 
ముఖ్యంగా, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అంటే ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వమని, ఇప్పటికే తమ సోదరి సమానురాలైన రాష్ట్ర హోం మంత్రి సుచరిత తక్షణం స్పందించి నిందితులను అరెస్టు చేయించారన్నారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలని, వాటిని కోసిపారేస్తే సరిపోతుందని రోజా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments