Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ వ్యవస్థ తీరు అభ్యంతరకరంగా ఉంది.. వైకాపా ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (12:45 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా ఎమ్మెల్యే  కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై వైకాపాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 
 
రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమన్నారు. 
 
ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. కోట్లాది మంది ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే పాలన ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా పాలనను దెబ్బతీసే విధంగా దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments