Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ రావు - పరకాలకు వైకాపా ఎమ్మెల్యే లీగల్ నోటీసు!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (10:42 IST)
ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ రావుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రభాకర్ మాట్లాడితే కనీసం తన వివరణ తీసుకోకుండానే, దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలను ఈనాడు పత్రికలో ప్రచురించారంటూ ఆ పత్రిక అధిపతి రామోజీ రావుకు ఆయన నోటీసులు పంపించారు. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్ట పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
అయితే, చెవిరెడ్డి వారిద్దరికి లీగల్ నోటీసులు పంపించడానికి కారణం లేకపోలేదు. చెవిరెడ్డి తండ్రికి పింఛను వస్తోందని... ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు పింఛన్ ఇవ్వాలా? అంటూ కొద్ది రోజుల క్రితం పరకాల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనిపై వైకాపా అధినేత జగన్ సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వార్తలు 'ఈనాడు'తో పాటు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, రామోజీ, పరకాలకు చెవిరెడ్డి నోటీసులు పంపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments