అభివృద్ధి కోసం రాజధాని మార్పును స్వాగతిస్తా : మంగళగిరి ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (13:16 IST)
వ్యక్తిగత పనులపై వేరే ఊరికి వెళితే తాను కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడ అంటూ విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లానని... దీనిపై ఇంత రాద్దాంతం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని... దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. 
 
ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని... ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే చెప్పారు. చాలా కాలం తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగబోతోందని... ఆ పనులపైనే తాను హైదరాబాదుకు వెళ్లానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments