Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత నారాయణ రెడ్డిని కేఈ కుటుంబీకులే హతమార్చారు : వైకాపా

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచార

Webdunia
ఆదివారం, 21 మే 2017 (18:03 IST)
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కాగా, ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలే పథకం ప్రకారం ఈ హత్య చేయించారని, ప్రజల  మనసులను గెలుచుకోవడం టీడీపీకి చేతగావడం లేదని, గత మూడేళ్ల టీడీపీ అరాచకపాలనకు ఇది పరాకాష్ట అని మండిపడింది. 
 
హత్యా రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, భయానక వాతావరణం సృష్టించి, హత్యలు చేయించి ప్రతిపక్షం నోరు మూయించేందుకు టీడీపీ సర్కార్ బరితెగించిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నారాయణరెడ్డి హత్యతో ఏపీ రాక్షస పాలన ఉగ్రవాద స్థాయికి చేరిందని, ఈ హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments