Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా కంటపడకుండా ఎట్టకేలకు లొంగిపోయిన బోరుగడ్డ!

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (09:07 IST)
ప్రముఖ రౌడీషీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు బుధవారం ఉదయం రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోయాడు. నిజానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన లొంగిపోవాల్సివుంది. కానీ, ఆయనకు మరోమారు మధ్యంంతర బెయిల్‌ను పొడగించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు మరోమార్గం లేక బుధవారం లొంగిపోయాడు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయిన మధ్యంతర బెయిలుపై ఉన్న వైకాపా నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. 
 
తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. 
 
తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్‌ను పొడగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేడా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంటపడకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments