Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా కంటపడకుండా ఎట్టకేలకు లొంగిపోయిన బోరుగడ్డ!

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (09:07 IST)
ప్రముఖ రౌడీషీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు బుధవారం ఉదయం రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోయాడు. నిజానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన లొంగిపోవాల్సివుంది. కానీ, ఆయనకు మరోమారు మధ్యంంతర బెయిల్‌ను పొడగించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు మరోమార్గం లేక బుధవారం లొంగిపోయాడు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయిన మధ్యంతర బెయిలుపై ఉన్న వైకాపా నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. 
 
తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. 
 
తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్‌ను పొడగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేడా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంటపడకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments