Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు ఎంపీ అభ్యర్థుల కొరత... 22 స్థానాలపై కసరత్తు!?

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (15:02 IST)
ఏపీలోని అధికార వైకాపా తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను కేవల మూడు చోట్ల మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. 
 
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం వైకాపా పెద్దలు అన్వేషిస్తున్నారు. 
 
ఆ పార్టీ సీనియర్ నేతలైన విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిలతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు గత 25 రోజులుగా తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైవున్నారు. సీఎం జగన్ వారితో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దాదాపు 92 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత నెలకొందని వారిస్థానంలో కొత్తవారిని నియమించి ఎన్నికల్లో గెలవాలని జగన్ భావిస్తున్నారు. కానీ అంతమంది సమర్థులు దొరకడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులకు తీవ్ర కొరత ఉంది. అరకు ఎంపీ మాధవి స్థానంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఇన్చార్జిగా నియమించారు. 
 
గోరంట్ల మాధవ్ స్థానంలో బళ్లారి బీజేపీ నేత శ్రీరాములు సోదరి శాంతను తీసుకొచ్చారు. తలారి రంగయ్యను కల్యాణదుర్గం ఇన్‌చార్జిగా నియమించారు. వంగా గీతను పిఠాపురం, మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ ఇన్‌చార్జిలుగా నియమించారు. మిగతా స్థానాల్లో పోటీకి ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులు దొరకడం లేదంటున్నారు. 
 
అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ గురువారం క్యాంపు కార్యాలయానికి వచ్చి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. జగన్ లేని సమయంలో వీరిద్దరూ రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments