Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు అడ్డు తగులుతా... అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తా!

మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:08 IST)
మిర్చి రైతులతో పాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు నల్లపాడు రోడ్డులో దీక్ష చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ దీక్ష మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఓ రైతు చేతులమీదుగా నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని చంద్రబాబు సర్కారుపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవన్నారు. చంద్రబాబు సీఎం అయితే వెంటనే కరువూ వస్తుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు దీక్షతో ప్రభుత్వం స్పందించని పక్షంలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి అడ్డు తగులుతామని.. ఇందుకోసం త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను ఎలా జరుపుతారో చూస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. 
 
మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. పనిలో పనిగా సీఎం తనయుడు నారా లోకేష్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు మంత్రులు చంద్రబాబు తనయుడు లోకేష్‌ను... లోకేష్‌ కాదంట లోక్యాష్‌ అని కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments