Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం : నేడు రూ.29.51 కోట్ల నిధుల జమ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల నిధులను జమ చేసింది. ఈ నిధులను మంగళవారం సీఎం జగన్ బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ నిధులను జమ చేయడం జరిగింది. 
 
నేడు రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీ 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీని మంగళవారం జమ చేసింది. గత 2021 నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు.  
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదును జమ చేశారు. 5,71,478 మంది రైతుల ఖాతాల్లోకి రూ.543.77 కోట్లను, అలాగే, 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను అందజేశారు. ఈ రెండు పథకాలకు మొత్తం రూ.564.28 కోట్లను జమచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments