Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో విజయమ్మ.. రాజశేఖర్ రెడ్డి వుండివుంటే ఇలా జరిగివుండేది కాదు..?

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (15:25 IST)
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ చేరుకున్నారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేదే కాదని, పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. 
 
మాటపై నిలబడే వ్యక్తి వైఎస్సార్ అని.. అదే గుణం జగన్‌లోనూ వుందని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో జగన్ ఎంతో శ్రమించారని, విడిపోయిన తరువాత కూడా ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని తొలి నుంచి నమ్మిన ఏకైక పార్టీ వైకాపాయేనని విజయమ్మ గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్, బీజేపీ తదితర అన్ని పార్టీలూ కలసి ఏపీని ఆటబొమ్మగా చేసుకున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఆనాడు కేవలం జగన్‌ను అణగదొక్కేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చించిందని.. ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఆనాడే విభజన హామీలను చట్టం రూపంలో తీసుకుని వచ్చుంటే, నేడు ఇలాంటి నిరసనలు జరిగి ఉండేవి కావని కాంగ్రెస్‌పై విజయమ్మ విమర్శలు గుప్పించారు. 
 
గడచిన మూడు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల్లో ఒకరైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన వెంటనే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. ఆయన తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్న మేకపాటి, దీక్షను కొనసాగిస్తే, ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. 
 
అలాగే ఏపీకి ప్రత్యేక హోదా నిమిత్తం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలలో మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన దీక్ష చేయడం సరికాదని వైద్యులు హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు బలవంతంగా ఆయన్ని అంబులెన్స్‌లో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments