Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైకాపా పక్కా ప్లాన్.. ప్రైవేట్ బిల్లుకు పట్టు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టాలని వైకాపా నిర్ణయించుకుంది. హోదా కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:04 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టాలని వైకాపా నిర్ణయించుకుంది. హోదా కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా ఓటింగ్‌కు పట్టుబట్టనుంది. 
 
ఇందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్యాకేజీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని, హోదాకు ఏదీ సాటిరాదని అన్నారు. దీనిపై పార్లమెంటులో గొంతు విప్పాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
 
ఈ సమావేశానికి అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ..  చట్టంలో ఉన్నవే కేంద్రం చేస్తోందని చెప్తునప్పుడు... మళ్లీ చట్టబద్ధత అంటూ ప్రజలను చంద్రబాబు మోసపుచ్చే కార్యక్రమాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 
 
గత ఏడాది భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో.. ఎంతమందికి ఉపాధి దొరికిందో చంద్రబాబు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. హోదా కోరుతూ ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశ పెట్టాలని... ఇందుకోసం...రాజకీయపక్షాల మద్దతును కూడగట్టాలని వైకాపా ఎంపీలు పక్కా ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments