Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐకి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు-రిజర్వ్‌లో తీర్పు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (15:00 IST)
వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న.. పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. సీఎం జగన్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు.. మెమో దాఖలుపై వివేకానందరెడ్డి కూతురు తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ ఉపసంహరణపై సీఎం జగన్‌ తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. టీడీపీ ప్రభుత్వం కేసు నీరుగార్చే అవకాశం ఉందని.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరిన విషయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ ఈ సందర్భంగా హైకోర్టుకు గుర్తు చేశారు.
 
కర్నూలులోని ఓ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని.. మరి వివేకా కేసులో అభ్యంతరమేంటని పిటిషనర్‌ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తీర్పు రిజర్వు చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments