Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సునీత భర్త ఇచ్చిన వాంగ్మూలంలో నిజం లేదు .. కృష్ణారెడ్డి

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (15:18 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తయారు చేసిన
చార్జిషీట్లను కోర్టుకు సమర్పిస్తుంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, వివేకా కుమార్తె డాక్టర్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాజశేఖర్ రెడ్డి అసత్య వాంగ్మూలం ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
గత 2019 మార్చి 13వ తేదీన గూగుల్ టేకౌట్‌ ప్రకారంత తనతో శివశంకర్ రెడ్డి ఉన్నారంటూ రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ రోజున వైఎస్ వివేకా ఇంటి వాస్తు చూపించేందుకు సూర్యనారాయణ అనే వాస్తు నిపుణుడిని తీసుకొచ్చాను. ఆయన ఇంటిని పరిశీలించి చిన్న మార్పు చేయాలని చెప్పారు. ఆసమయంలో శివశంకర్ రెడ్డి కూడా ఇంట్లో ఉన్నారని, అపుడు నేను ఫోన్ చేశానని రాజశేఖర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం చెప్పడం సరికాదన్నారు. 
 
అసలు ఆరోజ శివశంకర్ రెడ్డి మాతో లేరు. నేను ఆయన్ను కలవలేదు. నాడు వివేకా ఇంట్లో ఉన్నది నేను, వాస్తు నిపుణుడు సూర్యనారాయణ మాత్రమే. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డికి కాదు కదా ఎవరికీ ఫోన్ చేయలేదు. మరొకరు లేరు. ఎవరికీ ఫోన్ చేయలేదు. కావాలంటే వాస్తు నిపుణుడు సూర్యనారాయణను కూడా విచారించుకోవచ్చు అని కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments