Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో సెల్ఫీల సందడే.. సందడి

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (12:13 IST)
వై.ఎస్ జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు సందడిగా మారింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, జగన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డి.ఎం.కె అధ్యక్షుడు స్టాలిన్ ఇలా పలువురు పాల్గొన్నారు. 
 
వై.ఎస్.ఆర్.సి.పి గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ గుండె ఉప్పొంగుతుండగా.. వేలాదిమంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా గురువారం  మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం కేసీఆర్‌తో పాటు స్టాలిన్ తదితర అతిథులకు జగన్ తన స్వగృహంలో విందు ఏర్పాటు చేశారు.
 
అతిథులు తిరిగి వెళ్లిపోయిన తరువాత జగన్ ఇల్లు సందడిసందడిగా మారింది. జగన్ తన కుటుంబ సభ్యులతో చాలా ఉల్లాసంగా గడిపారు. లండన్‌లో ఉంటున్న జగన్ కుమార్తెలు ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి రావడం, షర్మిల-షర్మిల భర్త అనిల్, షర్మిల ఇద్దరు పిల్లలు ఇలా మరికొందరు కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరి ఆనందగా గడిపారు. అందరూ కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చిన ఆనందకర మూమెంట్స్‌ను తమ కెమెరాలలో బంధించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి దిష్టి తీస్తూ...

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments