Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:13 IST)
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఆందోళన బాటపడుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మాట ఇచ్చి మోసం చేయడం అంటే ఇదేనేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వారిని వెంటనే చర్చలకు ఆహ్వానించి వారి కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 
 
ముఖ్యంగా, అంగన్‌వాడీ ప్రధాన డిమాండ్లు అయిన నెలకు గౌరవ వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని, విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు అంత్యక్రియల కోసం రూ.20 వేలు ఇవ్వాలని, వీటితో పాటు మరో 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments