Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:13 IST)
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఆందోళన బాటపడుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మాట ఇచ్చి మోసం చేయడం అంటే ఇదేనేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వారిని వెంటనే చర్చలకు ఆహ్వానించి వారి కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 
 
ముఖ్యంగా, అంగన్‌వాడీ ప్రధాన డిమాండ్లు అయిన నెలకు గౌరవ వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని, విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు అంత్యక్రియల కోసం రూ.20 వేలు ఇవ్వాలని, వీటితో పాటు మరో 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments