Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ పులా? సింహమా? బీజేపీపై గర్జించమనండి.. వైఎస్ షర్మిల

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (23:00 IST)
YS Sharmila
తునిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు జగన్‌ దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదాను పక్కనబెట్టారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరారు. 
 
ఏపీలో మూడు రాజధానుల పేరిట మభ్యపెట్టి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని, చంద్రబాబు, జగన్‌ పాలనలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైన రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ పులా? సింహమా? ఏది.. అయితే బీజేపీపై ఒక్కసారి గర్జించమని అడగండి.. అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు, ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగడం తప్పా మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను జగనన్న మోసం చేశారని షర్మిల అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments