Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (11:56 IST)
పారిశ్రామికవేత్త అదానీ దేశం పరువు తీస్తే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ పరువు తీశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి రూ.1750 కోట్ల మేరకు అదానీ గ్రూపు లంచాలు ఇచ్చినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ తేల్చింది. పైగా, ఈ అంశంపై పలువురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, ఏపీ జగన్ పరువు తీశారని, అదానీ దేశం పరువు తీశారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ అవినీతి గురించి చర్చ జరుగుతుందన్నారు. జగన్... మీరు తీసుకున్న రూ.1750 కోట్ల లంచం ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 

కారు యజమానిని వణికించిన కాకులు 
 
ఓ కారు యజమానికి అనేక కాకులు వణికించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కారణం లేకపోలేదు. కాకి ఒకటి ఓ కారుపై వాలింది. యజమాని వచ్చి కాకే కదా.. హుష్ అంటే పోతుందని భావించాడు. కానీ, కారుపై అలాగే ఉండిపోయింది. చేతిలో నెట్టివేయాలని చూశాడు. కానీ, కాకి మాత్రం అక్కడ నుంచి కదల్లేదు. ఇలా కాదని దగ్గరగా వెళ్లి కాకిని చేతిలోకి తీసుకుని ఓ పక్కకు విసిరేద్దామనుకున్నాడు. 
 
కానీ కాకిని అలా చేతిలోకి తీసుకోగానే... చుట్టుపక్కల ఉన్న మరికొన్ని కాకులు వేగంగా దూసుకొచ్చాయి. ఆ కారు యజమానిని కాళ్లతో తన్ని ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఇదేమిటని అతడు భయంగా చూస్తుంటే... పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై వాలి, మళ్లీ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోకో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments