Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విశాఖపట్టణం పర్యటనకు సీఎం జగన్

Webdunia
గురువారం, 11 మే 2023 (08:53 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టరులో పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళతారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 
 
ఆ తర్వాత హెల్త్ సిటీలోని అపోలో ఆస్పత్రిలో కేన్సర్ విభాగాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ నిర్మించిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే ఎంవీపీ కాలనీలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, రామనగర్‌లోని వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆ తర్వాత ఎండాడలో నిర్మించనున్న కాపు భవన్‌కు శంకుస్థాపన చేస్తారు. పిమ్మట పక్కనే ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటరులో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని తిరిగి విజయవాడలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments