Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సీరియస్ : ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు??

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (18:56 IST)
వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పట్ల ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అలాగే ఆయనకు షోకాజ్ నోటీసు పంపించాలని వైకాపా అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వైకాపా యేడాది పాలనపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వైసీపీ ఏడాది పాలనలో కులరాజకీయం, అవినీతి, ఇసుక, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. 
 
ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. పైపెచ్చు... ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 
 
షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడానికి కూడా వెనకాడబోమన్న సంకేతాలు ఇచ్చారని.. అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, ఎంపీ రఘురామరాజుపై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెంటనే స్పందించిన ఆయన.. తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని, అయితే పార్టీలోకి తనకు తానుగా రాలేదని, కాళ్లావేళ్లా బతిమిలాడితే వచ్చానని చెప్పుకొచ్చారు. 
 
మంచిదో, చెడ్డదో నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. అంతకుముందు అడిగితే ఛీ కొట్టిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. తన కర్మో, వాళ్ల కర్మో పక్కన పెడితే తాను కాబట్టే నరసాపురం ఎంపీ సీటు వైసీపీ సొంతమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే.. ఆయా కులాలకు చెందిన వారితో విమర్శలు చేయిస్తారని ఇది వైసీపీ సాంప్రదాయమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments