Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్‌‌లే ముద్దు.. ఏపీ మాజీ సీఎం జగన్

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (09:49 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఈవీఎంలను నేరుగా టార్గెట్ చేసి అనుమానాలు వ్యక్తం చేయలేదు. 
 
అయితే, తొలిసారిగా ఆయన ట్విట్టర్‌లో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంలపై నమ్మకం క్షీణిస్తున్న నేపథ్యంలో పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించడం మంచి ఎంపిక అని ఆయన సూచించారు.
 
 
"న్యాయం జరిగేలా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో, పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా అదే దిశలో వెళ్లాలి' అని జగన్ ట్వీట్ చేశారు. 
 
 
 
ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పేర్కొన్న టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కూడా బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి ఓటేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments