Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు సీఎం జగన్ శుభవార్త : దెబ్బతిన్న ఇళ్లకు...

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (17:26 IST)
ఏపీలోని వరద బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న గృహాల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న సాయం పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాల్లో సాగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులోభాగంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపణీతో పాటు బాధిత కుటుంబాలకు రూ.2 వేలు అదనంగా చెల్లించాలని కోరారు.
 
అలాగే, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తాగునీటితో పాటు.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వరదల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments