Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ.. నిరుద్యోగ భృతిపై ఫైర్.. పవన్ ప్రస్తావన కూడా తెచ్చారెందుకు?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును ఎండగట్టారు. నిరుద్యోగ సమస్యను అస్త్రంగా ఉపయోగించారు. ఇదే లేఖలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది.

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (13:28 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును ఎండగట్టారు. నిరుద్యోగ సమస్యను అస్త్రంగా ఉపయోగించారు. ఇదే లేఖలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది. నిరుద్యోగ భృతి హామీపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి.. గత ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పవన్ సైతం పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని బట్టి అటు చంద్రబాబుతో పవన్‌ను కూడా జగన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నప్పటికీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోలేకపోయిందని టీడీపీని జగన్ ఏకి పారేశారు. ఇందులో పవన్‌ను కూడా టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా జగన్, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ లేఖలో జగన్ పవన్ పేరెత్తడం ద్వారా ఎన్నికల హామిలకు ప్రభుత్వంతో పాటు టీడీపీకి మద్దతునిచ్చిన పవన్ కూడా బాధ్యత వహించాలని జగన్ పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కాగా, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2వేలు చొప్పున ప్రతి నిరుద్యోగికి చెల్లించాల్సి వుంటుందని బహిరంగ లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆ లెక్కన ప్రభుత్వం 1.15 లక్షల కోట్లు బకాయిలు పడిందని జగన్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం జగన్ రాసిన బహిరంగ లేఖను తిప్పికొట్టే పనిలో ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

తర్వాతి కథనం
Show comments