Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో సీఎం జగన్ - పవన్ కళ్యాణ్ రాకతో సందడే సందడి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (08:44 IST)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయనడు, తన మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి హాజరయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్.. తన మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకుని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. 
 
ఇక త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్న రాజారెడ్డి ప్రియలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు వచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.
 
అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై త్వరలో ఒక్కటి కాబోతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత షర్మిల, బ్రదర్ అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి ఫోటోలు దిగారు. కాగా, పవన్ రాకతో గోల్కొండ రిసార్ట్స్‌లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments