Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు - భయంతోనేనా...

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (15:02 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ఆయన ఈ నెల 27, 28వ తేదీల్లో తిరుమల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి తిరుపతికి చేరుకుని, అక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గంలో కాని నడకన తిరుమలకు చేరుకుని, 28వ తేదీ శనివారం శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించారు. కానీ, ఆయన పర్యటన చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు అయింది. 
 
గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల పర్యటన చేపడితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని భావించారు. అందుకే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పోలీసు వర్గాలు కూడా హెచ్చరించాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా అనుమానాలు కలిగాయి. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన పర్యటన రద్దుకు గల కారణాలను ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర రిలీజ్.. సుదర్శన్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం.. కటౌట్ దగ్ధం (video)

ఎన్టీఆర్‌ తో కొరటాల శివ దేవర తో సక్సెస్ ఇచ్చాడా? లేదా? . దేవర రియల్ రివ్యూ

'దేవర'ను చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని

ప్రకాష్ రాజ్ అంటే ఇష్టం.. అపార్థం చేసుకోలేదు.. అర్థం చేసుకున్నా.. పవన్ కల్యాణ్

బిగ్ బాస్ షోలో మహేష్ బాబు కోడలు శిల్పా శిరోద్కర్?!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments