Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మగ్గముంటే చాలు యేడాదికి రూ.24 వేలు సాయం : జగన్

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని మరో వరాన్ని ప్రకటించారు. నేతన్నలను ఆదుకునేందుకు వీలుగా ఈ వరం ఉంది. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. 
 
అనంతపురం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ధర్మవరం పట్టు వస్త్రాలు దేశానికే ఆదర్శమన్నారు. చేనేత కష్టాలు తెలుసు కాబట్టే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 
 
నేతన్న నేస్తం డబ్బులను పాత అప్పుల కింద జమ చేయవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని.. సమాజానికే బ్యాక్ బోన్ అని అభివర్ణించారు. జనవరి 9 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
ఉగాది రోజున 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన 81 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments