Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా! భారీగా జీతభత్యాలు కూడా...

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (13:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడెమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాథ్యంలోని వైకాపా సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
దీంతో ఆమెకు రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
 
రాష్ట్రంలో వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల కాలంలో తమకు మద్దతుగా, అనుకూలంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతున్న విషయం తెల్సిందే. ఈ కోవలో ఇప్పటికే సినీ నటి ఆర్కే. రోజా, వాసిరెడ్డి పద్మలకు నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఇపుడు లక్ష్మీపార్వతి పార్వతి వంతు చ్చింది.
 
ఇక తాజాగా ఆమెకు కేబినెట్ హోదా కూడా లభించింది. లక్ష్మీ పార్వతితో పాటు గల్ఫ్ దేశాల్లో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జుల్ఫీకి కూడా కేబినెట్ హోదా లభించింది. అయితే జగన్ పార్టీ పెట్టిన కొన్ని రోజులకు వైసీపీలో చేరిన లక్ష్మీపార్వతి.. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments