Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై జగన్ సర్కారు వెనక్కి!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (10:56 IST)
ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. విలీనానికి అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విషయం స్పష్టం చేశారు.
 
'ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు' అని సీఎం వెల్లడించారు. 
 
'ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరం. దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరం' అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 
 
మరోవైపు,  ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిపై సర్కారు దిగొచ్చింది. విలీనంతో విద్యా వ్యవస్థ ధ్వంసమవుతుందని, ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మిగిలిపోతాయంటూ మీడియాలో వచ్చిన కథనాలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. 
 
ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:20గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల విలీనం కొనసాగాలని, అయితే 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కాకుండా 20 మందికి ఒకరు చొప్పున ఉండాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. ఇప్పటివరకు ఈ నిష్పత్తి 1:30గా ఉండేది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయగా మారతాయనే ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments