Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 6500 పోస్టుల భర్తీ చేస్తామన్న సీఎం జగన్

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:23 IST)
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ప్రతి పోలీసు అమరవీరుడికి జేజేలు పలికారు. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించవద్దని సీఎం జగన్ సూచించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని పేర్కొన్నారు.
 
కుల, మత ఘర్షణల్లో ఎలాంటి ఉపేక్ష లేకుండా పోలీసులు పనిచేయాలన్నారు. దిశ పీఎస్‌లు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయన్నారు. దిశ బిల్లును త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments