Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (09:05 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ట్‌పై బయటేవుంటారు. ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు ఓ వాహనం ఉంటుంది.
 
అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, వివేకా హత్య కేసులో ఈ యేడాది ఏప్రిల్ నెలలో భాస్కర్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments