Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినోడే కదా అని బైకెక్కితే... మార్గమధ్యంలో కిందపడేసి ఆ పని చేశాడు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:10 IST)
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. తెలిసినోడే కదా అని బైకు ఎక్కినందుకు ఆ మహిళ రేప్‌కు గురైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి అనే గ్రామానికి చెందిన ఓ మహిళ... తన వ్యక్తిగత పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. 
 
అక్కడ తన పని ముగించుకుని తిరుగు ప్రయాణమైంది. ఇంతలో తమ గ్రామానికే చెందిన మేకల సురేష్ అనే యువకుడు బైకుపై కనిపించడంతో పలుకరించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బైకు ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆ వ్యక్తి తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. 
 
బైకును ఆపి.. ఆ మహిళను బలవంతంగా కిందపడేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న బాధిత మహిళ.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments