Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింటి లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:03 IST)
కోనసీమ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు - అత్తిలి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన పోతంశెట్టి వెంకట బసివిరెడ్డి(23) ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణ చెరువు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఫైనాన్స్‌ వ్యాపారం చేసే బసివిరెడ్డి గ్రామాల్లో డబ్బులు ఇచ్చి వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం వసూళ్లకు వెళ్తుండగా ఆలమూరు శివారు భగ్గేశ్వరం డ్రెయిన్‌ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కన్నుమూశాడు.
 
నెల రోజుల కిందటే బసివిరెడ్డికి నిశ్చితార్థమైంది. సెప్టెంబరు నెలలో వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చియించుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం గ్రామాంతరం వెళ్లిన కుమారుడు తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments