విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్టౌన్ లోని శ్రీదేవి లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ నగరంలో వన్టౌన్ పరిధిలో శ్రీదేవి లాడ్జీ ఉంది. గుర్తు తెలియని ఇద్దరు యువతి, యువకుడు అద్దెకు గది తీసుకున్నారు.
ఈ స్థితిలో శుక్రవారం వారు ఉన్న గది ఎంతకీ తెరవకపోవడంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం ఏర్పడింది. దీంతో తలుపు పగులగొట్టి చూడగా ఆ యువ జంట ఆత్మహత్య చేసుకుని మృత దేహాలుగా దర్శనమిచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే లాడ్జి యజమాని పరారయ్యాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ జంట ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, లాడ్జీ యజమాని ఎందుకు పరారైయ్యాడు వంటి వివరాల కోసం విచారణ చేపట్టారు.