Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్ళకు పోయేకాలం దగ్గరపడింది.. శ్రీవారితో జగన్‌ను పోల్చుతారా? ఆర్ఆర్ఆర్ ఫైర్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (12:54 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలు అధికార మదంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని, వీరికి పోయేకాలం దగ్గరపడిందని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సీఎం జగన్‌ను కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామితో పోల్చుతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రుషికొండపై జగన్ భవనాన్ని తిరుమల కొండపై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంతో పోల్చడం సిగ్గుచేటన్నారు. మనిషి అనేవాడు ఇలా వ్యాఖ్యానించరన్నారు. 
 
విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి, అక్రమంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మంత్రులు దేవుడితో పోల్చడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 
 
టూరిజం కాటేజీల ముసుగులో జగన్ కట్టుకుంటున్న అక్రమ భవనం సీఆర్‌జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని... ఈ జోన్‌లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన కూడా మంత్రులకు లేదని ఎద్దేవా చేశారు. మంత్రులకు మతి పోయినట్టు ఉన్నారు. కొండపై కట్టిన నాలుగు బ్లాకులకు 4 పేర్లు పెట్టారని రఘురాజు తెలిపారు. 
 
వీటిలో సీఎం నివాస సముదాయం, క్యాంపు కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని అన్నారు. టూరిజం కాటేజీల ముసుగులో నిర్మించుకున్న ఈ అక్రమ భవానాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కూల్చి వేయాలని చెప్పారు. ఈ భవనాల నిర్మాణాలకు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments