Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:27 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో వైకాపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
 
మద్యం కేసులో గురువారం అరుణ్‌ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు.. ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలుపగా.. 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
 
అలాగే, కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా గురువారం విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని కోర్టుకు ఈడీ సమాచారం ఇచ్చింది. 
 
పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైకాపా ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసు మూలాలు ఏపీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments