Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు.. నందిగం సురేశ్‌కు రిమాండ్

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:19 IST)
విజయవాడ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసు విచారణ శరవేగంగా సాగుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వైకాపా నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వైకాపా నేతలను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గురువారం ఉదయం వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత మరో వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. అప్పిరెడ్డిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నారు. 
 
కాగా, నందిగం సురేశ్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు, ఈ దాడి కేసులో సంబంధం ఉన్న వైకాపా నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేయగా, ఈ బృందాలు ఈ వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments