వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భయంకరమే.. : వసంత కృష్ణప్రసాద్

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (19:56 IST)
వచ్చే ఎన్నికల్లో వైకాపా మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భయంకరపరిస్థితులతో పాటు అరాచకం ఏర్పడుతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అమరావతి రాజధానిపై యుటర్న్ తీసుకుని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకుని రావడం పెద్ద తప్పు అని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ను తిడితేనే వైకాపా పెద్దలు తమను నమ్మే పరిస్థితి ఉందన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్‌కే సాధ్యమన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "తాను వైకాపాలో చేరిన రోజే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా అని జగన్‌ను తాను ప్రశ్నించగా, తన ఇల్లు, ఆఫీసు కూడా ఇక్కడే కట్టానని, అందువల్ల ఇక్కడే ఉంటానని నమ్మబలికారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పాట మొదలు పెట్టారు. ఇది మాట తప్పడం, మడమ తిప్పడం కాదా?'' అని నిలదీశారు. 
 
జగన్ పాలన ఇంకా కొనసాగితే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని, అందువల్లే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూడు రాజధానులను తాను వ్యతిరేకిస్తే.. కొడాలి నాని, అంబటి రాంబాబు బెదిరింపు ధోరణితో మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను దూషిం చాలని పార్టీ పెద్దలు పలుమార్లు తనపై ఒత్తిడి తెచ్చినట్టు చెప్పారు. ఆ పని చేయకపోవడం వల్ల తనను ఇబ్బందులకు గురిచేశారన్నారు. "ప్రతిపక్షనేతలను తిట్టని నిన్ను ఎలా నమ్మాలి అని.. సాక్షాత్తు జగనే వ్యాఖ్యానించారు" అని వసంత చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments