Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కి.మీటర్లు.. రోజా పాదయాత్ర

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చే దిశగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తాను సైతం అంటూ మరో పాదయాత్రకు సిద్ధ

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (10:47 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చే దిశగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తాను సైతం అంటూ మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో దిట్ట అయిన రోజా ప్రజా సమస్యలపై నోరెత్తారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టారు. 
 
ప్రస్తుతం రోజా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను గాలేరు-నగరి ప్రాజెక్టును వేదికగా చేసుకున్నారు. తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 28వతేదీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర ప్రారంభం కానుంది. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు వైకాపా వర్గాలు వెల్లడించాయి. 
 
నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు రోజా పాదయాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments