Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యలు ప్రస్తావిస్తే చెప్పుతో కొడతా : గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే కాపు వార్నింగ్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (08:58 IST)
తాను వచ్చినపుడు సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానని గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయనకు గ్రామస్థులు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. 
 
తమకు ప్రతి నెలా రేషన్ సరకులు రావడం లేదని వాపోయారు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడకు వచ్చారంటూ నిలదీశారు. ఈ మాటలతో కాపు రామచంద్రారెడ్డికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానంటూ పచ్చి బూతులతో దూషించారు. 
 
ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించండతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు సర్దిచెప్పడంతో స్థానికులు శాంతించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments