Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యలు ప్రస్తావిస్తే చెప్పుతో కొడతా : గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే కాపు వార్నింగ్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (08:58 IST)
తాను వచ్చినపుడు సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానని గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయనకు గ్రామస్థులు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. 
 
తమకు ప్రతి నెలా రేషన్ సరకులు రావడం లేదని వాపోయారు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడకు వచ్చారంటూ నిలదీశారు. ఈ మాటలతో కాపు రామచంద్రారెడ్డికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానంటూ పచ్చి బూతులతో దూషించారు. 
 
ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించండతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు సర్దిచెప్పడంతో స్థానికులు శాంతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments